పాడైపోయిన గుడ్లు కాల్చివేత
ABN, First Publish Date - 2021-12-09T04:24:52+05:30
వరదల కారణంగా ఓ శాఖకు కేటాయించిన గుడ్లు పాడవ్వడంతో వాటిని గుట్టుచప్పుడు కాకుండా రాజంపేట మండలం మన్నూరు చెరువుకాలువలో పోసి కాల్చివేశారు.
రాజంపేట, డిసెంబరు 8 : వరదల కారణంగా ఓ శాఖకు కేటాయించిన గుడ్లు పాడవ్వడంతో వాటిని గుట్టుచప్పుడు కాకుండా రాజంపేట మండలం మన్నూరు చెరువుకాలువలో పోసి కాల్చివేశారు. వరదల వల్ల ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఈ గుడ్లను సరఫరా చేయడంలో జరిగిన ఆలస్యాన్ని గుర్తించి చెడిపోయిన ఈ గుడ్లను ఎవరి కంటా పడకుండా కుప్పగా పోసి కాల్చివేశారు. అక్కడున్న కొందరు ఈ గుడ్లు కాల్చివేత ఫొటోను తీసి ఆంధ్రజ్యోతికి పంపారు.
Updated Date - 2021-12-09T04:24:52+05:30 IST