న్యూట్రీగార్డెన్ ఏర్పాటు
ABN, First Publish Date - 2021-11-03T05:08:59+05:30
గొల్లలగూడూ రు అంగన్వాడీ కేంద్రం వద్ద ప్రకృతి వ్య వసాయ సిబ్బంది సూర్యమండల మో డల్ న్యూట్రీగార్డెన్ ఏర్పాటు చేశారు.
వేముల, నవంబరు 2: గొల్లలగూడూ రు అంగన్వాడీ కేంద్రం వద్ద ప్రకృతి వ్య వసాయ సిబ్బంది సూర్యమండల మో డల్ న్యూట్రీగార్డెన్ ఏర్పాటు చేశారు. ప్రకృతి వ్యవసాయ గ్రామ ఇన్చార్జి ఉమాదేవి, మాస్టర్ ట్రైనర్లు భాస్కర్ రెడ్డి, రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం రైతులు అవలంభిస్తున్న రసాయన వ్యవసాయంలో పండించే కూరగాయలు, ఆకుకూరలు తినడం వలన అనేక రోగాలబారిన పడుతున్నా మన్నారు.
ఈ ప్రభావం పిల్లలపై మ రింత ఎక్కువగా ఉంటుందన్నారు. అం గన్వాడీ సెంటర్లో పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనం ఆరోగ్యకరం, పౌష్టికంగా ఉండాలని ప్రతి అంగ న్వాడీ, పాఠశాలల్లో అన్ని రకాల ఆకుకూరలు పండించుకోవాలని, అం దుకు తగిన సహకారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ అరుణేశ్వరి, పండిట్ జవహర్లాల్ నెహ్రూ కళాశాల వ్యవ సాయ విద్యార్థులు మేఘన, సాహితి పాల్గొన్నారు.
Updated Date - 2021-11-03T05:08:59+05:30 IST