ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ చార్జీల పెంపుపై దశలవారీ ఉద్యమాలు

ABN, First Publish Date - 2021-10-08T04:36:06+05:30

విద్యుత్‌ చార్జీల పెంపును నిరసి స్తూ టీడీపీ దశల వారీ ఉద్యమాలు చేపడుతుందని ఆ పార్టీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి పేర్కొ న్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు క్రైం, అక్టోబరు 7 : విద్యుత్‌ చార్జీల పెంపును నిరసి స్తూ టీడీపీ దశల వారీ ఉద్యమాలు చేపడుతుందని ఆ పార్టీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి పేర్కొ న్నారు. గురువారం విలేఖరులతో ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో పేద, మధ్య తరగతి ప్రజల జీవనం కష్టంగా ఉంటే, జగన్‌ సర్కార్‌ ఈ రెండేళ్లలో ఆరు సార్లు విద్యుత్‌ చార్జీలను పెంచిందన్నారు. ఈ క్రమంలోనే  ఈనెలలో దశల వారీగా ఉద్యమాలను చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా పదో తేదీ వరకు  ప్రజలను చైత న్యం చేయడం, 11 నుంచి 17 వరకు మండల, గ్రామస్థా యిలో అయా కమిటీలతో సమావేశమై విద్యుత్‌ చార్జీల పెంపుపై తీర్మానం చేయడం, 18 నుంచి 24 వరకు నియోజకవర్గ ఇన్‌చార్జీలు, ఎమ్మెల్యేలు కనీసం ఏడు గ్రామాల్లో పర్యటించి చార్జీల పెంపు గురించి ప్రజలకు వివరించడం 25 నుంచి 31 వరకు జోనల్‌, రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమాలలో టీడీపీ నా యకులు, కార్యకర్తలు  పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో టీడీపీ నాయకులు సుబ్బరాజు, నాగరాజు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-08T04:36:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising