ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్నికి ఆహుతైన వేరుశనగ వామి

ABN, First Publish Date - 2021-03-23T04:46:06+05:30

మండలంలోని గుండ్లచెరువు పంచాయతీ అమ్మగారిపల్లెకు చెందిన రైతులు ఎద్దుల రమణయ్య, నాయుడుల వేరుశనగ వామి అగ్నికి ఆహుతైంది.

కాలిపోతున్న వేరుశనగ వాములు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాలివీడు, మార్చి 22: మండలంలోని గుండ్లచెరువు పంచాయతీ అమ్మగారిపల్లెకు చెందిన రైతులు ఎద్దుల రమణయ్య, నాయుడుల వేరుశనగ వామి అగ్నికి ఆహుతైంది. బాధితుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే.. ఎద్దుల రమణయ్య, నాయుడులు రబీ సీజన్‌లో వేరుశనగను సాగు చేశారు. ఈ ఏడాది వేరుశనగ పంట ఆశాజనకంగా ఉందని, వేరుశనగ కట్టెను పెరికి కాయలను కోయకుండా అలాగే వామి వేశామని తెలిపారు. ఇంతలోనే వేరుశనగ వామికి సమీపంలో కొండకు నిప్పు పెట్టడంతో కొండ కాలుకుంటూ వచ్చి తమ వాములకు కూడా అంటుకున్నదని తెలిపారు. దాదాపుగా ఒక్కొక్క రైతు రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని కోరారు. 

Updated Date - 2021-03-23T04:46:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising