నిషేధిత ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు తొలగిస్తాం
ABN, First Publish Date - 2021-11-03T05:20:51+05:30
జగనన్న లేఅవుట్ కాలనీ సమీపంలో వెళుతున్న హెచ్పీసీఎల్ గ్యాస్ పైపులైన్ ప్రాం తంలో అక్రమ నిర్మాణాలు చేపడితే తొలగిస్తామని తహసీల్దార్ సత్యానందం మంగళవారం తెలిపారు.
సంబేపల్లె, నవంబరు2: జగనన్న లేఅవుట్ కాలనీ సమీపంలో వెళుతున్న హెచ్పీసీఎల్ గ్యాస్ పైపులైన్ ప్రాం తంలో అక్రమ నిర్మాణాలు చేపడితే తొలగిస్తామని తహసీల్దార్ సత్యానందం మంగళవారం తెలిపారు. రాయచోటి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి గ్యాస్ పైపులైన్ సమీపంలో పునాది నిర్మాణం చేపట్టినట్లు ఫిర్యాదు రావడంతో పరిశీలించడం జరిగిందన్నారు. ఈ నిర్మాణాన్ని తొలగిస్తామని హెచ్చరించారు. జగనన్న కాలనీలో ప్రజా అవసరాల కోసం తాగునీటి బోర్లను ఈ ప్రాంతంలో వేసినట్లు సమాచారం రావడంతో వాటిని కూడా సీజ్ చేస్తామని తెలియజేశారు. ఈ ప్రాంతంలో ఏదైనా అక్రమ నిర్మాణాలు చేపడితే తొలగించక తప్పదని తెలియజేశారు. ప్రమాదం జరగక ముందే చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు.
Updated Date - 2021-11-03T05:20:51+05:30 IST