ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీఎంఈఆర్సీ బోర్డును నియమిస్తూ సర్కార్ ఉత్తర్వులు

ABN, First Publish Date - 2021-02-02T18:32:20+05:30

ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పోరేషన్ బోర్డును నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్  రీసెర్చ్ కార్పోరేషన్ బోర్డును నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.  వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్గా 8 మంది ఉన్నతాధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.  బోర్డు సభ్యులుగా... వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ,  వైద్య విధాన పరిషత్ కమిషనర్లు, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓ, ఎంఎస్ఐడీసీ ఎండీ, వైద్యవిద్యా డైరెక్టర్ తదితర అధికారులు ఉండనున్నారు. రాష్ట్రంలో వైద్యారోగ్య సేవల్ని మరింత విస్తృత పరచటంతో పాటు ప్రస్తుత ఆస్పత్రులు, నర్సింగ్ కళాశాలల అభివృద్ధి, కొత్త వైద్య కళాశాలల నిర్మాణంపై  ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పోరేషన్ దృష్టి పెట్టనుంది. నూతన బోధనాసుపత్రుల నిర్మాణం కోసం ఆర్ధిక వనరుల సమీకరణ బాధ్యతనూ ఏపీఎంఈఆర్సీకి ప్రభుత్వం అప్పగించింది. 

Updated Date - 2021-02-02T18:32:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising