నందిగంలో స్థలవివాదంపై రగడ..
ABN, First Publish Date - 2021-07-12T06:57:25+05:30
నందిగం గ్రామంలో ఆదివారం ఇరువర్గాల మధ్య స్థల వివాదం ఘర్షణకు దారితీసి కర్రలు, ఇనుప రాడ్లతో దాడిచేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి.
ఇరువర్గాల బాహాబాహీ
13 మందికి గాయాలు
పెడన రూరల్, జూలై 11: నందిగం గ్రామంలో ఆదివారం ఇరువర్గాల మధ్య స్థల వివాదం ఘర్షణకు దారితీసి కర్రలు, ఇనుప రాడ్లతో దాడిచేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. బొడ్డుజ్ఞానానందం, బొడ్డు చిన అమలేశ్వరరావుల మధ్య గతంలో ఉన్న స్థలవివాదం స్థానిక పెద్దల సమక్షంలో పరిష్కారం కుదిరింది. దీంతో ఆదివారం ఓవర్గానికి చెందిన పెద్దలపై మరోవర్గంవారు పాతకక్షల నేపథ్యంలో దారికాచి కర్రలు, రాడ్లతో దాడికి దిగారు. దాడిలో 13మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. అధికారపార్టీ అండదండలతో తమపై తరచు దాడులు చేస్తున్నట్టు టీడీపీ నుంచి ఎన్నికయిన సర్పంచి చినబాబు ఆరోపిస్తున్నారు. ఎస్సై మురళి పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను బందరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.గ్రామంలో పోలిస్ పికెట్ ఏర్పాటు చేశామని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
Updated Date - 2021-07-12T06:57:25+05:30 IST