ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన : సీఈ

ABN, First Publish Date - 2021-11-02T06:01:05+05:30

స్పందనలో వచ్చే సమస్యల అర్జీలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని నగరపాలక సంస్థ చీఫ్‌ ఇంజనీర్‌ ఎం.ప్రభాకరరావు అన్నారు.

స్పందనలో ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్న సీఈ ఎం.ప్రభాకరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన : సీఈ

చిట్టినగర్‌, నవంబరు1: స్పందనలో వచ్చే సమస్యల అర్జీలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని నగరపాలక సంస్థ చీఫ్‌ ఇంజనీర్‌ ఎం.ప్రభాకరరావు అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో స్పందన కార్యక్రమం నిర్వహించారు. నగరంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను అర్జీలుగా మేయర్‌కు అందజేశారు.  మొత్తం 13 అర్జీలు వచ్చాయి. సర్కిల్‌-1లో 2, సర్కిల్‌-2లో-5, సర్కిల్‌-3 పరిధిలో-5 అర్జీలు వచ్చాయి. సమస్యలను ఆయా విభాగాలకు చెందిన అధికారులు క్షేత్రస్థాయిలో త్వరితగతిన పరిష్కరించాలని మేయర్‌ అధికారులకు సూచించారు. అదనపు కమిషనర్‌ యుశారదాదేవి, ఎస్టేట్‌ అధికారి ఏ.శ్రీధర్‌ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

స్పందనలో 70 ఫిర్యాదుల స్వీకరణ

గుణదల: పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో నగర వాసుల నుంచి 70 ఫిర్యాదులు స్వీకరించినట్లు డీసీపీ డి.మేరీ ప్రశాంతి తెలిపారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా సోమవారం ఆన్‌లైన్లో స్పందన నిర్వహించామని, ప్రజలకు భద్రత, భరోసా కల్పించేందుకు స్పందన ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. పరిష్కారానికి ఆస్కారం లేని ఫిర్యాదులు వస్తే ప్రాథమిక దశలోనే వాటిని ఫిర్యాదు దారులకు తెలియజేస్తామని తెలిపారు. సోమవారం తమ దృష్టికి వచ్చిన ఫిర్యాదులను ఆయా పోలీస్‌స్టేషన్ల ఇన్‌చార్జ్‌లకు బదలాయించినట్లు తెలిపారు. 

Updated Date - 2021-11-02T06:01:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising