ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదుపుతప్పి ఆటో బోల్తా

ABN, First Publish Date - 2021-05-30T06:02:34+05:30

మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామం వద్ద శనివారం అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందాగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. ఎమ్మిగనూరుకు చెందిన ఆటోలో నాగలదిన్నెకు చెందిన ఇసుబు(54)తో పాటు మరో ఐదుగురు మంత్రాలయం వస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు


మంత్రాలయం, మే 29. మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామం వద్ద శనివారం అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందాగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. ఎమ్మిగనూరుకు చెందిన ఆటోలో నాగలదిన్నెకు చెందిన ఇసుబు(54)తో పాటు మరో ఐదుగురు మంత్రాలయం వస్తున్నారు. డ్రైవర్‌ మద్యం సేవించి ఆటో నడుపుతున్నందు వల్ల చిలకలడోణ వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఇసుబు అక్కడిక్కడే మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న సూరన్న, ఆరుణమ్మలతో పాటు మరొకరికి గాయాలయ్యాయి. వారిని  ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇసుబు మృతాదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎమ్మిగనూరుకు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎర్రన్న పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-30T06:02:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising