ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నూలు జిల్లా: సచివాలయ భవనం నిర్మాణంపై హైకోర్టు సీరియస్

ABN, First Publish Date - 2021-08-10T20:32:45+05:30

కర్నూలు జిల్లా జి.సింగవరం నీటిపారుదల శాఖ స్థలంలో..సచివాలయ భవనం నిర్మాణంపై హైకోర్టు సీరియస్ అయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కర్నూలు జిల్లా జి.సింగవరం నీటిపారుదల శాఖ స్థలంలో..సచివాలయ భవనం నిర్మాణంపై హైకోర్టు సీరియస్ అయింది. తక్షణమే భవన నిర్మాణాన్ని ఆపేయాలని న్యాయస్థానం ఆదేశించింది. సర్పంచ్ నాగేంద్ర సచివాలయ భవన నిర్మాణంపై హైకోర్టును ఆశ్రయించారు. భవనాన్ని గ్రామంలో నిర్మించాలని అడిగినా ఊరికి దూరంగా.. సచివాలయం కట్టడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ వేశారు.


భవన నిర్మాణం కోసం కాంట్రాక్టర్‌కు రూ.9 లక్షలు చెల్లించాలని..సర్పంచ్‌కు పంచాయతీ కార్యదర్శి నోటీసులపై నాగేంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శి సర్పంచ్‌కి నోటీసులు ఎలా ఇస్తారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నోటీసులను నిలిపివేసింది. సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా గెలవడంతో అధికార పార్టీ సభ్యులు వేధిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది యలమంజుల బాలాజీ కోర్టుకు తెలిపారు.

Updated Date - 2021-08-10T20:32:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising