ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేతన్న నేస్తం కాదు.. నేతన్నకు మోసం

ABN, First Publish Date - 2021-08-11T05:19:18+05:30

రాష్ట్ర ప్రభుత్వం నేతన్న నేస్తంతో పేరుతో నేతన్నను మోసం చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ద్వజం 


ఎమ్మిగనూరు, అగస్టు10: రాష్ట్ర ప్రభుత్వం నేతన్న నేస్తంతో పేరుతో నేతన్నను మోసం చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆరోపించారు. ప్రచార ఆర్భాటం తప్ప చేనేతలను ఆదుకోవాలనే ఆశయం లేని పథకం అని విమర్శించారు. గత టీడీపీ ప్రభుత్వం కార్పొరేషన్‌ ద్వారా రూ. 2లక్షల వరకు రుణాలను పావలా వడ్డీకే ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఆదరణ పథకం ద్వారా మగ్గం మిషన్‌లను పంపిణీ చేశారని, సిల్కు కొనుగోలులో రాయితీ ఇచ్చారని అన్నారు. నేడు ఆ పథకాలు అన్నీ రద్దుచేసి కేవలం రూ.24 వేలు ఇచ్చి వైసీపీ ప్రభుత్వం చేతులు దులుపుకోవటం దారుణమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3.50లక్షలు మంది చేనేతకార్మికలు ఉంటే కేవలం 69వేల మందికి మాత్రమే పథకం వర్తింపచేయటం మోసం కాదా అని ప్రశ్నించారు. ఎమ్మిగనూరులో 5వేల మంది చేనేత కార్మికులు ఉంటే కేవలం కొందరికి మాత్రమే పథకాన్ని వర్తింపచేశారని అన్నారు. 

Updated Date - 2021-08-11T05:19:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising