ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఓర్వకల్లును కరువు మండలంగా ప్రకటించాలి’

ABN, First Publish Date - 2021-08-28T05:11:18+05:30

ఓర్వకల్లును కరువు మండలంగా ప్రకటించాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌ రెడ్డి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామక్రిష్ణ డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓర్వకల్లు, ఆగస్టు 27: ఓర్వకల్లును కరువు మండలంగా ప్రకటించాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌ రెడ్డి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామక్రిష్ణ డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండలంలోని తిప్పాయపల్లె గ్రామంలో వాడుముఖం పట్టిన మొక్కజొన్న పంటలను బృందం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌ రెడ్డి, రామకృష్ణ మాట్లాడుతూ ఈ ఏడాది తగినంత వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతే రాజు అంటూ చెబుతూ.. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల నడ్డీ విరిచే విదంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. తక్షణమే అధికారులు స్పం దించి రైతుల పొలాలను పరిశీలించి, ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. నాయకులు నాగన్న, శ్రీధర్‌, షాజహాన్‌, మధుసూదన్‌, వెంకటేశ్వర్లు, రంగస్వామి, మాసూంబాషా, రైతులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-08-28T05:11:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising