హై కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనకు నిరసనగా ధర్నా
ABN, First Publish Date - 2021-08-28T03:54:17+05:30
హైకోర్టు ఉత్తర్వుల ను రెవెన్యూ అధికారులు ఉల్లంఘించారంటూ మర్లపూడి గ్రామానికి చెందిన బాధితులు శుక్రవారం స్థా నిక తహసీల్దార్ కార్యాల యం ఎదుట ధర్నా చేశారు.
సైదాపురం, ఆగస్టు 27: హైకోర్టు ఉత్తర్వుల ను రెవెన్యూ అధికారులు ఉల్లంఘించారంటూ మర్లపూడి గ్రామానికి చెందిన బాధితులు శుక్రవారం స్థా నిక తహసీల్దార్ కార్యాల యం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా బాధితుడు పిన్ను తిరుపతి మాట్లాడుతూ గత ఏడాది చీర్ల వెంకురెడ్డి అనే వ్యక్తి తమ భూములపై తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతోపాటు అధికార పార్టీ నాయకులతో తహసీల్దారుపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఆయన నోటీసులు జారీ చేయగా, తాము హై కోర్టును ఆశ్రయించామని తెలిపారు. తమకు అనుకూలంగా హైకోర్టు ఉత్త ర్వులు వచ్చినా, తమ భూమిలో తాము పనులు చేసుకోకుండా ఇబ్బం దులకు గురి చేస్తున్నారన్నారు. రెవెన్యూ అధికారులు హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకపోవడంపై తహసీల్దార్కు వినతిపత్రం అందజేశామన్నారు. కసర్పంచు మోడి రమణయ్య, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ వరదబండి వెంకటేశ్వర్లు రెడ్డి, గ్రామ టీడీపీ అధ్యక్షుడు పాపకన్ను రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2021-08-28T03:54:17+05:30 IST