ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లి మరణాన్ని తట్టుకోలేక బాలిక ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-12-20T05:03:07+05:30

అన్నిటికీ ఆధారమైన అమ్మే లేనప్పుడు నేను కూడా ఈ లోకంలో ఉండను.... అమ్మా నీదగ్గరికే వచ్చేస్తున్నా... అని తల్లి మరణాన్ని తట్టుకోలేక ఓ బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు(క్రైం), డిసెంబరు 19: అన్నిటికీ ఆధారమైన అమ్మే లేనప్పుడు నేను కూడా ఈ లోకంలో ఉండను.... అమ్మా నీదగ్గరికే వచ్చేస్తున్నా... అని తల్లి మరణాన్ని తట్టుకోలేక ఓ బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... నెల్లూరులోని నవాబుపేట ప్రాంతంలో కార్తీక్‌రాజు కుటుంబం నివసిస్తోంది. ఐదు నెలల క్రితం కార్తీక్‌రాజు భార్య అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో ఇంటర్మీడియట్‌ చదువుతున్న వారి కుమార్తె సర్వేపల్లి అక్షయ(16) తీవ్ర మనోవేదనకు గురైంది. నిత్యం తల్లిని గుర్తు చేసుకుంటూ, నిద్రలోనూ తల్లినే కలవరిస్తూ.... తాను కూడా అమ్మ దగ్గరికి వెళ్లిపోతా అని చెబుతూ ఉండేది. ఈ క్రమంలో శనివారం రాత్రి ఫ్యానుకు చున్నీతో ఉరివేసుకుంది. గుర్తించిన తండ్రి హుటాహుటిన వైద్యశాలకు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. నవాబుపేట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇన్‌స్పెక్టర్‌ సుబ్బారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-12-20T05:03:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising