హక్కులపై అవగాహన పెంచుకోవాలి
ABN, First Publish Date - 2022-01-01T04:38:35+05:30
పౌరహక్కులపై ప్రతి ఒక్కరు విధిగా అవగాహన పెంచుకోవాలని తహసీల్దారు పద్మావతి కోరారు.
కోట, డిసెంబరు 31 : పౌరహక్కులపై ప్రతి ఒక్కరు విధిగా అవగాహన పెంచుకోవాలని తహసీల్దారు పద్మావతి కోరారు. లింగాలస్వామి గిరిజన కాలనీలో శుక్రవారం పౌరహక్కుల దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎంపీడీవో భవాని, పంచాయతీరాజ్ ఏఈ కిరణ్కుమార్, మనోజ్కుమార్ పౌరహక్కులపై అవగాహన కల్పించారు.
రాపూరు: స్థానిక ఆంజనేయపురం గిరిజన వాడలో శుక్రవారం సాయంత్రం తహసీల్దారు పద్మావతి పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించి మాట్లాడుతూ పౌరహక్కులను వివరించి గిరిజనులకు పునరావాసకేంద్రం ఏర్పాటుచేస్తామని ప్రకటించారు.
Updated Date - 2022-01-01T04:38:35+05:30 IST