ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముత్యాలమ్మ జాతర ప్రారంభం

ABN, First Publish Date - 2021-04-07T04:40:40+05:30

మండలంలోని తూర్పు కనుపూరు గ్రామంలో మంగళవారం ముత్యాలమ్మ జాతర ప్రారంభమైంది. ఉగాదికి ముందు వచ్చే మంగళవారం నుంచి శుక్రవారం వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

వెండిచీర అలంకరణలో ముత్యాలమ్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కొవిడ్‌తో పరిమిత సంఖ్యలోనే భక్తులు

 చిల్లకూరు, ఏప్రిల్‌ 6: మండలంలోని తూర్పు కనుపూరు గ్రామంలో మంగళవారం ముత్యాలమ్మ జాతర ప్రారంభమైంది.  ఉగాదికి ముందు వచ్చే మంగళవారం నుంచి శుక్రవారం వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. గతేడాది కరోనా ప్రభావంతో భక్తులు లేకుండానే జాతరను నిర్వహించారు. ఈ ఏడాది కరోనా రెండో దశ వ్యాపిస్తుండడంతో పరిమితి సంఖ్యలో భక్తులను అనుమతించారు. దాంతో తొలిరోజు భక్తులు తక్కువ సంఖ్యలో వచ్చారు.  కోట మండలం సిద్దవరం గ్రామంలో పుట్టినిల్లు కుమ్మరింట నుంచి తూర్పుకనుపూరులోని మెట్టినిల్లు చాకలి ఇల్లు గంగమిట్టపై తాటాకుల గుడిసెలు ఏర్పాటు చేసి మంగళవారం అర్ధరాత్రి పోలేరమ్మను ప్రతిష్ఠించారు. గణాచారి పుట్టింటి నుంచి పోలేరమ్మను పంబలోళ్ల వాయిద్యాల నడుమ ఊరేగింపుగా  తీసుకొచ్చి ప్రతిష్టించడంతో జాతర ప్రారంభమైంది. జాతర ఏర్పాట్లను ట్రస్టు బోర్డు ఛైర్మన్‌ వేమారెడ్డి  మురళీమోహన్‌ రెడ్డి,  ఆలయ ఈవో కోవూరు జనార్దన్‌ రెడ్డి, కమిటీ సభ్యుడు సాయికృష్ణారెడ్డి పర్యవేక్షించారు. గూడూరు డీఎప్పీ రాజగోపాల్‌ రెడ్డి, రూరల్‌ సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఐ బాబీ జాతర వద్ద ఎలాంటి ఘర్షణలు, తోపులాటలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - 2021-04-07T04:40:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising