స్వర్ణముఖినదిలో మునిగి వృద్ధుడి మృతి
ABN, First Publish Date - 2021-12-27T04:36:42+05:30
స్వర్ణముఖినదిలో ఓ వృద్ధుడు శనివారం సాయం త్రం ప్రమాదవశాత్తూ మునిగిపోయి మృతిచెందాడు.
పెళ్లకూరు, డిసెంబరు 26 : స్వర్ణముఖినదిలో ఓ వృద్ధుడు శనివారం సాయం త్రం ప్రమాదవశాత్తూ మునిగిపోయి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు చిల్లకూరు గ్రామానికి చెందిన పుల్లా రంగయ్య (57) స్వర్ణముఖినది అవతల ఉన్న తన పొలంలోకి వెళ్లి పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి బయలుదేరాడు. నదిని దాటుతూ తెలియక లోతుగా ఉన్న చోట దిగడంతో మునిగిపోయాడు. సాయంత్రానికి రంగయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వివాహమైన కుమార్తెలకు, బంధువులకు సమాచారం అందించారు. ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం ఉదయం ఓ వ్యక్తి సమాచారంతో కుటుంబసభ్యులు నదిలో గాలించగా కప్పగుంటకండ్రిగ బ్రిడ్జి సమీపంలో శవమై కన్పించాడు. మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. హెడ్ కానిస్టేబుల్ అహ్మద్బాషా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య మస్తానమ్మ, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Updated Date - 2021-12-27T04:36:42+05:30 IST