సమస్యాత్మక గ్రామాలపై దృష్టి
ABN, First Publish Date - 2021-02-06T04:42:38+05:30
పంచాయతీ ఎన్నికల్లో సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు జిల్లా ఆడిషనల్ ఎస్పీ వెంకటరత్నం పేర్కొన్నారు.
ఆడిషనల్ ఎస్పీ వెంకటరత్నం
వరికుంటపాడు/ఉదయగిరి రూరల్, ఫిబ్రవరి 4: పంచాయతీ ఎన్నికల్లో సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు జిల్లా ఆడిషనల్ ఎస్పీ వెంకటరత్నం పేర్కొన్నారు. శుక్రవారం ఆమె వరికుంటపాడు, దుత్తలూరు మండలాల్లోని గణేశ్వరాపురం, తిమ్మారెడ్డిపల్లి, తూర్పుకొండారెడ్డిపల్లి, దుత్తలూరు, నర్రవాడ గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఆమె వెంట కావలి డీఎస్పీ ప్రసాద్, ఉదయగిరి సీఐ ప్రభాకర్రావు, ఎస్ఐలు ఉమాశంకర్, జంపాని కుమార్, సిబ్బంది ఉన్నారు.
కొండాపురం : పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని జిల్లా అడిషనల్ ఎస్పీ పీ.వెంకటరత్నం అన్నారు. మండలంలోని గరిమెనపెంట గ్రామ పోలింగ్ స్టేషన్ను ఆమె పరిశీలించారు. ఓటర్లను డబ్బు. మద్యం వంటి ప్రలోభాలకు గురిచేస్తే అభ్యర్ధులపై చట్టపరమయిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆమె వెంట డీఎస్పీ ప్రసాద్, కలిగిరి సీఐ శ్రీనివాసులు, ఎస్సై పీ.రవిబాబు ఉన్నారు.
కలిగిరి : పంచాయతీ ఎన్నికలు సుజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటరత్నం పేర్కొన్నారు. మండలంలోని అనంతపురం, కావలిముస్తాపురం గ్రామాల్లోని పోలింగ్ బూత్లను ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ వీరేంద్ర బాబు పాల్గొన్నారు.
Updated Date - 2021-02-06T04:42:38+05:30 IST