వైభవంగా గోదా రంగనాయకస్వామి కల్యాణం
ABN, First Publish Date - 2021-01-14T04:53:06+05:30
భోగి సందర్భంగా గోదా రంగనాయక స్వామి కల్యాణాన్ని బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక ఎన్నెస్పీ కాలనీలోని వేంకటేశ్వరాలయం, కోదండరామాలయాలలో స్వామి వారి కల్యాణాన్ని నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు.
త్రిపురాంతకం, జనవరి 13 : భోగి సందర్భంగా గోదా రంగనాయక స్వామి కల్యాణాన్ని బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక ఎన్నెస్పీ కాలనీలోని వేంకటేశ్వరాలయం, కోదండరామాలయాలలో స్వామి వారి కల్యాణాన్ని నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థ , అన్న ప్రసాద కార్యక్రమాలు చేపట్టారు. సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించారు.
పెద్దదోర్నాలలో..
పెద్ద దోర్నాల: స్థానిక లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా భోగి పండుగను పురస్కరించుకుని గోదాదేవి, శ్రీ కృష్ణుడి కల్యాణ వేడుకలను బుధవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్ల కల్యాణ క్రతువును తిలకించి పులకించిపోయారు.
కంభంలో
కంభం : స్థానిక వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో బుధవారం భోగిపండుగ సందర్భంగా వేంకటేశ్వరస్వామి, ఉభయదేవిల కల్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించారు. కల్యాణాన్ని అనేక మంది భక్తులు పాల్గొని తిలకించారు.
Updated Date - 2021-01-14T04:53:06+05:30 IST