సీఎఫ్ఎంస్లో సమస్యలు పరిష్కరించాలి: ఏపీటీఎఫ్
ABN, First Publish Date - 2021-08-27T08:59:56+05:30
రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, హేతుబద్దీక రణ జరిగి ఏడునెలలైనా ఇంతవరకు పొజిషన్ ఐడీల కేటాయింపు..
అమరావతి, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, హేతుబద్దీక రణ జరిగి ఏడునెలలైనా ఇంతవరకు పొజిషన్ ఐడీల కేటాయింపు పూర్తికాలేదని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్య (ఏపీటీఎఫ్) తెలిపింది. చెల్లింపులు, ఇతర అంశాల పరిష్కారం కోసం ఆన్లైన్లో సీఎ్ఫఎం్సకు పంపిన దరఖాస్తులు పరిష్కరించడంలో విపరీమైన జాప్యం జరుగుతోందని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.పాండురంగ వరప్రసాదరావు పేర్కొన్నారు. సీఎ్ఫఎంఎ్సలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులు పరిష్కారమయ్యేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Updated Date - 2021-08-27T08:59:56+05:30 IST