గుంటూరు కలెక్టరేట్ ఎదుట దళితుల ధర్నా
ABN, First Publish Date - 2021-08-02T19:07:58+05:30
గుంటూరు కలెక్టరేట్ ఎదుట చిలకలూరిపేట మండలం మురికిపూడి దళితులు ధర్నాకు దిగారు. వైసీపీ నేత వెంకట శివ, ఆరుద్ర అనిల్లను తక్షణమే అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు.
గుంటూరు : గుంటూరు కలెక్టరేట్ ఎదుట చిలకలూరిపేట మండలం మురికిపూడి దళితులు ధర్నాకు దిగారు. వైసీపీ నేత వెంకట శివ, ఆరుద్ర అనిల్లను తక్షణమే అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. మైనింగ్ కోసం భూమి ఇవ్వలేదని మూరికిపూడి గ్రామ వైసీపీ అధ్యక్షుడు కులం పేరుతో దూషిస్తూ.. ఆదిబాబు అనే వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసినా అరెస్ట్ కాకుండా ఎమ్మెల్యే విడదల రజనీ అడ్డుకుంటోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అట్రాసిటీ కేసులు ఉన్న వ్యక్తికి జీడీఎంఎస్ డైరెక్టర్ పదవి ఎలా ఇస్తారని మండిపడ్డారు. బాధితుడు కలెక్టర్ ఆఫీస్ వద్ద ఉండగానే రేషన్ షాపుపై దాడి చేయించిన ఎమ్మెల్యే విడదల రజనీ తీరుపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Updated Date - 2021-08-02T19:07:58+05:30 IST