ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఓటిఎస్‌’తో పేదలను వంచిస్తోంది

ABN, First Publish Date - 2021-12-20T04:56:40+05:30

రాష్ట్ర ప్రభుత్వం ఓటీఎస్‌ పేరుతో పేదలను వంచిస్తోందని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆగ్రహం వ్యక్తంచేశారు. సారవకోట మండలం మహసింగి గ్రామంలో ఆదివారం గౌరవ సభ ప్రజా సమస్యలు చర్చావేదిక నిర్వహించారు.

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సారవకోట (జలుమూరు) డిసెంబరు 19: రాష్ట్ర ప్రభుత్వం ఓటీఎస్‌ పేరుతో పేదలను వంచిస్తోందని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆగ్రహం వ్యక్తంచేశారు. సారవకోట మండలం మహసింగి గ్రామంలో ఆదివారం గౌరవ సభ ప్రజా సమస్యలు చర్చావేదిక నిర్వహించారు. ప్రతీ ఏటా ఇంటిపన్ను కడుతున్న లబ్ధిదారుకు ఆ ఇంటిపై హక్కు లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజానీకానికి వివరించారు. నిత్యావసర వస్తువుల నుండి పెట్రోల్‌ వరకు ధరలు పెంచారన్నారు. ఓటీఎస్‌ను ఎవరూ కట్టవద్దని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారి ఇంటిపై వారికే హక్కు కల్పిస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి టీడీపీ బలోపేతానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో  టీడీపీ మం డల అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ, పార్టీ  జిల్లా అధికార ప్రతినిధి సురవరపు తిరుపతిరావు,  నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-12-20T04:56:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising