కొవిడ్ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ వేసుకోవాలి
ABN, First Publish Date - 2021-02-06T05:10:32+05:30
కరోనా నియంత్రణకు కొవిడ్ వ్యాక్సిన్ను ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని తహసీల్దార్ జామి ఈశ్వరమ్మ తెలిపారు.
జలుమూరు,
ఫిబ్రవరి 5: కరోనా నియంత్రణకు కొవిడ్ వ్యాక్సిన్ను ప్రతి ఒక్కరూ
వేయించుకోవాలని తహసీల్దార్ జామి ఈశ్వరమ్మ తెలిపారు. స్థానిక పీహెచ్సీలో
శుక్రవారం ఆమె వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
తొలిదశలో వైద్య సిబ్బందికి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ కార్యకర్తలకు ఈ
వ్యాక్సిన్ వేసినట్లు చెప్పారు. ప్రస్తుతం వివిధ శాఖల్లో పనిచేస్తున్న
సిబ్బందికి వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. కార్యక్రమంలో
వైద్యాధికారులు తాడేల శ్రీకాంత్, చల్ల వంశీకృష్ణ, వైద్య సిబ్బంది
పాల్గొన్నారు.
Updated Date - 2021-02-06T05:10:32+05:30 IST