యాదవులను ఎంబీసీలో చేర్చాలి
ABN, First Publish Date - 2021-11-01T05:08:42+05:30
యాదవులను అత్యంత వెనుకబడిన జాబితా (ఎంబీసీ)లో చేర్చాలని అఖిల భారత యాదవ మహాసభ అహిర్ రాష్ట్ర అధ్యక్షుడు గద్దెబోయిన గురునాథ్ కోరారు. ఆదివారం రాజాంలో జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు.
సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గురునాథ్
రాజాం, అక్టోబరు 31: యాదవులను అత్యంత వెనుకబడిన జాబితా (ఎంబీసీ)లో చేర్చాలని అఖిల భారత యాదవ మహాసభ అహిర్ రాష్ట్ర అధ్యక్షుడు గద్దెబోయిన గురునాథ్ కోరారు. ఆదివారం రాజాంలో జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదవులు బీసీ-డి లో ఉండడం వల్ల విద్యా, రాజకీయ, సామాజిక రంగాల్లో అభివృద్ధి చెందలేకున్నారన్నారు. వారి జీవన ప్రమాణాలు అత్యంత దయనీయంగా తయారయ్యాయని పేర్కొన్నారు. వారిని ఎంబీసీలో చేర్చడం వల్ల అభివృద్ధి చెందుతారన్నారు. ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన బీసీ కమిటీ యాదవుల జీవన విధానం, వారి స్థితిగతులపై అధ్యయనం చేసేలా కమిషన్కు సూచించాలన్నారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గద్దెబోయిన కృష్ణ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉల్లాకుల నీలకంటేశ్వరయాదవ్, జాతీయ కార్యదర్శి భాగ్య చంద్రరావు, పలువురు నేతలు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-11-01T05:08:42+05:30 IST