ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉన్నది పోయె.. రావాల్సిందే రాకపోయే..: తులసి‌రెడ్డి

ABN, First Publish Date - 2021-02-08T19:52:35+05:30

బీజేపీ పాలనలో ఉన్నది పోయె.. రావాల్సిందే రాకపోయే.. అన్నట్లు రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసి‌రెడ్డి ఎద్దేవా చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: బీజేపీ పాలనలో ఉన్నది పోయె.. రావాల్సిందే రాకపోయే.. అన్నట్లు రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసి‌రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలోని బీజేపీ నాయకులకు రాష్ట్రం పట్ల అభిమానం ఉంటే వెంటనే పార్టీ, కేంద్ర ప్రభుత్వ పదవులకు రాజీనామా చేయాలని తులసి‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా తీసుకురావడంలో బీజేపీ, వైసీపీ నాయకులు ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. గత 50 సంవత్సరాలుగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్మాలనుకోవడం దౌర్భాగ్యమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌ను స్థాపిస్తే బీజేపీ ప్రభుత్వం మూసివేయాలని చూస్తుందోని ధ్వజమెత్తారు. కడప ఉక్కు కర్మాగారం పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం కాళహస్తి వద్ద మన్నవరం ఎన్టీపీసీ- బీహెచ్ఈఎల్ ప్రాజెక్టును స్థాపిస్తే బీజేపీ పాలనలో మూతపడిందని తులసి‌రెడ్డి చెప్పారు.

Updated Date - 2021-02-08T19:52:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising