ఎన్ఎస్ఎస్ వలంటీర్ల మహా స్వచ్ఛ భారత్
ABN, First Publish Date - 2021-03-14T05:44:40+05:30
ఎంవీపీ కాలనీ రైతుబజారు, ఆర్టీసీ బస్ డిపో ఆవరణలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వ ర్యంలో శనివారం మహా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎంవీపీ కాలనీ, మార్చి 13: ఎంవీపీ కాలనీ రైతుబజారు, ఆర్టీసీ బస్ డిపో ఆవరణలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వ ర్యంలో శనివారం మహా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏయూ రిజిస్ట్రార్ వి.కృష్ణమోహన్ ప్రారంభించారు. ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, విద్యార్థులు ఎంవీపీ కాలనీ రైతుబజారు, ఆర్టీసీ డిపోలో శ్రమదానం చేసి చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ యువత స్వచ్ఛ భారత్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ముఖ్య వైద్యాధికారి డాక్టర్ శాస్త్రి, ఎన్ఎస్ఎస్ రాష్ట్ర శిక్షణ సంస్థ సమన్వయకర్త డాక్టర్ పి.రామచంద్రయ్య, ప్రొగ్రామ్ కో-ఆర్డినేటర్ హరనాథ్, ప్రతినిధి కేసీ రెడ్డి, అప్పలనాయుడు, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-03-14T05:44:40+05:30 IST