ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ సోకిందని... రైతు బలవన్మరణం

ABN, First Publish Date - 2021-05-03T04:37:16+05:30

కొవిడ్‌ సోకిందనే మనస్తాపంతో ఓ రైతు రైలు కింద పడి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సూర్యనారాయణ (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైలు కిందపడి ఆత్మహత్య 



కశింకోట, మే 2: కొవిడ్‌ సోకిందనే మనస్తాపంతో ఓ రైతు రైలు కింద పడి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకరమైన సంఘటనకు సంబంధించిన తుని రైల్వే ఎస్‌ఐ అబ్దుల్‌మారూఫ్‌ అందించిన వివరాలిలా ఉన్నాయి.  మండలంలోని నూతనగుంటపాలెం శివారు త్రిపురవానిపాలెం గ్రామానికి చెందిన చప్పా సూర్యనారాయణ (58) ఆరోగ్యం బాగోకపోవడంతో శనివారం అనకాపల్లిలోని ఓప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ అతడికి కొవిడ్‌  పరీక్షలు నిర్వహించిన వైద్యులు పాజిటివ్‌గా నిర్థారించారు. దీంతో మనస్తాపం చెందిన సూర్యనారాయణ బయ్యవరం- నర్సింగబిల్లి రైల్వేస్టేషన్ల మధ్య రైలుకింద పడి  ఆత్మహత్యకు పాల్పడాడు.  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుని రైల్వే ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ మారూఫ్‌ తెలిపారు.  

Updated Date - 2021-05-03T04:37:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising