ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
ABN, First Publish Date - 2021-08-27T05:55:48+05:30
ఆరిలోవ ఇందిరానగర్ రామలయం వీధిలో ఉరి వేసుకుని ఆళ్ల గోపి (50) అనే పెయింటర్ ఆత్మహత్య చేసుకున్నట్టు ఆరిలోవ సీఐ ఇమాన్యుల్ రాజు తెలిపారు.
ఆరిలోవ, ఆగస్టు 26: ఆరిలోవ ఇందిరానగర్ రామలయం వీధిలో ఉరి వేసుకుని ఆళ్ల గోపి (50) అనే పెయింటర్ ఆత్మహత్య చేసుకున్నట్టు ఆరిలోవ సీఐ ఇమాన్యుల్ రాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ హుక్కి తాడుతో ఉరి వేసుకుని గోపి ఆత్మహత్య చేసుకున్నట్టు ఆయన తల్లి అప్పయ్యమ్మ ఫిర్యాదు చేసిందన్నారు. తన ఆరోగ్యం బాగోక పోవడంతో ఆస్పత్రికి వెళ్లి వచ్చేసరికి తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడినట్టు పేర్కొందని తెలిపారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. కాగా మృతుడు గోపి భార్యతో విభేదాల కారణంగా ఏడేళ్ల నుంచి తల్లితో కలిసి విడిగా ఉంటున్నాడు. తమ ఇద్దరు కుమార్తెలు తనవద్దకు రాకపోవడంతో మానసికంగా కుంగిపోవడంతో పాటు మద్యానికి బానిసై, జీవితంపై విరక్తి చెంది గోపి ఆత్మహత్యకు పాల్పడినట్టు సీఐ పేర్కొన్నారు.
Updated Date - 2021-08-27T05:55:48+05:30 IST