ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మధ్యాహ్న భోజనంపై విచారణ

ABN, First Publish Date - 2021-02-06T05:05:53+05:30

మండలంలోని ధర్మవరం పాఠశాలలో మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉంద ని, దీనిపై విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారని పత్రికల్లో రావడంతో జిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌ మట్టా సింహాచలం స్పందించారు.

భోజనం చేస్తున్న అసిస్టెంట్‌ కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 చర్యలు తప్పవన్న అసిస్టెంట్‌ కలెక్టర్‌

శృంగవరపుకోట రూరల్‌: మండలంలోని ధర్మవరం పాఠశాలలో మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉంద ని, దీనిపై విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారని పత్రికల్లో రావడంతో జిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌ మట్టా సింహాచలం స్పందించారు. పత్రికల్లో వార్త చూసిన వెంటనే నేరుగా శుక్రవారం పాఠశా లకు వచ్చి హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, వంట నిర్వాహకులు, పాఠశాల పేరెంట్స్‌ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వ హించారు.  అనంతరం విద్యార్థులను ప్రశ్నించగా వారు భోజనం బాగోలేదని సమాధానం ఇచ్చారు. దీనిపై హెచ్‌ఎంతో మాట్లా డారు. అనంతరం మధ్యాహ్న భోజనం చేసి సంతృప్తి వ్యక్తంచేశారు. ఎస్‌ఐ నీలకంఠంను రప్పించి పాఠశాల పరిధిలో రాత్రివేళల్లో అసాంఘిక కార్యకలపాలు జరుగుతున్నాయని ప్రతిరోజూ పెట్రోలింగ్‌ నిర్వహించాలని ఆదేశించారు. మరోసారి విద్యార్థులకు ఇబ్బందికరమై న పరిణామాలు ఏర్పడితే సంబంధిత వ్యక్తులపై చర్యలకు సిపార్సు చేస్తామని హెచ్చరించారు. ఏండీఎం ఏడీ అరుణజ్యోతి, ఏంఎంవో బి.అప్పారావు, ఇన్‌చార్జి సీహెచ్‌డీటీ రామారావు తదితరులు ఉన్నారు.

 


Updated Date - 2021-02-06T05:05:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising