ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లుల అపహరణ.. ముగ్గురిపై కేసు

ABN, First Publish Date - 2021-10-14T05:39:56+05:30

ఏలూరులో 20 పిల్లులను అపహరించిన ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు క్రైం, అక్టోబరు 13 : ఏలూరులో 20 పిల్లులను అపహరించిన ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దెందులూరు మండలం నాగులదేవుపాడుకు చెందిన దానం మేరీ రాజమండ్రిలోని ‘యానిమల్‌ లవర్స్‌’ సంస్థ సభ్యురాలు. ఏలూరులో కూరగాయల షాపు నిర్వహిస్తున్నారు. ఆమె రోజూ కుక్కలు, పిల్లులకు ఆహారాన్ని పెడుతుంటారు. ఈ నెల 12న ముగ్గురు వ్యక్తులు రోడ్లపై సుమారు 20 పిల్లులను పట్టుకుని వెళుతుండగా మున్సిపల్‌ ఆఫీసు వద్ద ఆమె వారిని అడ్డగించి వాటిని వదిలి వేయాలని చెప్పారు. ఆమెను తోసేసి వాటిని అపహరించుకుపోవడంతో మేరీ ఏలూరు వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వై.బాలరాజాజీ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి ముగ్గురి కోసం గాలిస్తున్నారు. 

Updated Date - 2021-10-14T05:39:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising