ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర కార్యదర్శిగా రవీంద్రరాజు
ABN, First Publish Date - 2022-01-01T05:11:59+05:30
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా భూపతిరాజు రవీంద్రరాజును నియమించారు.
భీమవరం/పెనుమంట్ర,డిసెంబరు 31 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా భూపతిరాజు రవీంద్రరాజును నియమించారు.ఈ మేరకు జిల్లా గ్రామ రెవె న్యూ అధికారుల సంఘం శుక్రవారం హర్షం వ్యక్తం చేసింది. పెను మంట్రకు చెందిన రవీంద్రరాజు ఏపీ వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు.ఆయన నియామకంపై జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా కార్యదర్శి రాంబా బు,రాష్ట్ర నాయకుడు మిరియాల లక్ష్మీనారాయణ, ఏలూరు,కొవ్వూరు, జం గారెడ్డిగూడెం, నరసాపురం డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు హర్షం ప్రకటించారు.
Updated Date - 2022-01-01T05:11:59+05:30 IST