‘వాహన ప్రమాద కేసులు పరిష్కరించాలి’
ABN, First Publish Date - 2021-01-13T05:35:06+05:30
మోటారు వాహన ప్రమాద కేసులు త్వరితగతిన పరిష్కరించి ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని జిల్లా ప్రధాన న్యాయ మూర్తి ఈ.భీమారావు ఆదేశించారు.
ఏలూరు క్రైం, జనవరి 12:మోటారు వాహన ప్రమాద కేసులు త్వరితగతిన పరిష్కరించి ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని జిల్లా ప్రధాన న్యాయ మూర్తి ఈ.భీమారావు ఆదేశించారు. ఈనెల 23న జాతీయ లోక్ అదాలత్ను పురస్కరించుకుని ఏలూరు లోక్ అదాలత్ భవనంలో ఇన్సూరెన్సు కంపెనీ అధికారులు, స్టాండింగ్ కౌన్సిల్, న్యాయవాదులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి అనేక ఇబ్బందులకు గురవుతూ ఉంటారని వారిని సకాలంలో ఆదుకోవడం వల్ల కొంత ఊరట కలుగుతుందని సూచించారు. మొదటి అదనపు జిల్లా జడ్జి టి.మల్లికార్జున, రెండో అదనపు జిల్లా జడ్జి పి.ప్రభాకర్, ఏలూరు బార్ అధ్యక్షుడు అబ్బినేని విజయ్కు మార్, డీఎల్ఎస్ఏ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వి.బాలకృష్ణయ్య, పాల్గొన్నారు.
Updated Date - 2021-01-13T05:35:06+05:30 IST