వ్యాక్సిన్కు రూ. 1600 కోట్లు ఇవ్వలేరా : గన్ని
ABN, First Publish Date - 2021-05-03T04:53:22+05:30
ప్రభుత్వ భవనాలకు మూడు వేల కోట్లు ఖర్చు చేశారు.
ఏలూరు టూటౌన్, మే 2 : ప్రభుత్వ భవనాలకు మూడు వేల కోట్లు ఖర్చు చేశారు. కరోనా వ్యాక్సిన్కు రూ. 1600 కోట్లు ఖర్చు చేయలేరా అంటూ ఏలూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు ప్రశ్నించారు. 18 ఏళ్లు దాటిన వాళ్ళకు వ్యాక్సిన్ మే 1 నుంచి ఇస్తామని ఇప్పుడు మడమ తిప్పారన్నారు. సీఎం సలహాదారులకు వందల కోట్ల రూపాయలు నెలకు జీతాలు ఇస్తూ వ్యాక్సిన్కు డబ్బులు లేవంటున్నారని, సీఎం రిలీఫ్ ఫండ్ అం తా ఏమవుతోందని ప్రశ్నించారు. సాక్షి పత్రికకు ప్రకటనల రూపంలో వందల కోట్లు ప్రజా ధనాన్ని దోచిపెడుతున్నారన్నారు. రాష్ట్రాలకు విపత్తుల నిర్వ హణ నిధి కింద రూ. 8873 కోట్లు విడుదల చేసిందని దీనిలో 50 శాతం కొవిడ్ బాధితుల కోసం వినియోగించవచ్చు అని సూచించారు. రెండేళ్లలో రూ.లక్షా 70 వేల కోట్ల అప్పులు తెచ్చి ఏం చేశారో అర్థం కావడం లేదన్నారు.
Updated Date - 2021-05-03T04:53:22+05:30 IST