తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్ల పట్టివేత
ABN, First Publish Date - 2021-12-31T18:10:22+05:30
పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి అంతరాష్ట్ర తనిఖీ కేంద్రం వద్ద సెబ్ అధికారులు వాహన తనిఖీలు నిర్వహించారు.
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి అంతరాష్ట్ర తనిఖీ కేంద్రం వద్ద సెబ్ అధికారులు వాహన తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ ప్రాంతం నుంచి ట్రాక్టర్లో అక్రమంగా తరలిస్తున్న 36 మద్యం బాటిళ్లను సెబ్ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి ట్రాక్టర్, మద్యం బాటిళ్లని అధికారులు సీజ్ చేశారు.
Updated Date - 2021-12-31T18:10:22+05:30 IST