200 మందికిపైగా వైద్యులను బలితీసుకున్న కరోనా సెకెండ్ వేవ్!
ABN, First Publish Date - 2021-05-18T11:02:48+05:30
కరోనా సెకెండ్ వేవ్ వైద్యులను కబళిస్తోంది.
న్యూఢిల్లీ: కరోనా సెకెండ్ వేవ్ వైద్యులను కబళిస్తోంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం కరోనా సెకెండ్ వేవ్లో దేశంలోని 244 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. గడచిన ఆదివారం ఒక్కరోజునే కరోనా కారణంగా 50 మంది వైద్యులు మృతి చెందారు. ఒక్క రోజులో అత్యధిక సంఖ్యలో వైద్యులు మరణించడం ఇదే తొలిసారి.
మీడియాకు అందిన వివరాల ప్రకారం బీహార్లో కరోనా కారణంగా అత్యధిక సంఖ్యలో వైద్యులు మరణించారు. బీహార్లో 69 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోగా, ఉత్తర ప్రదేశ్లో 34 మంది, ఢిల్లీలో 27 మంది వైద్యులు మరణించారు. కరోనాకు పిన్నవయస్కుడైన డాక్టర్ అనాస్ ముజాహిద్ బలయ్యారు. ఆయన ఢిల్లీలోని గురు తేజ్ బహదూర్ ఆసుపత్రిలో జూనియర్ రెసిడెంట్ డాక్టర్. గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్లో దేశంలోని 730 మంది వైద్యులు మృతిచెందారు. కాగా దేశంలో అత్యధికశాతం వైద్య నిపుణులు టీకా మొదటి మోతాదు తీసుకున్నారు.
Updated Date - 2021-05-18T11:02:48+05:30 IST