ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్థిక సలహాదారుగా ‘నోబెల్‌’ గ్రహీత!

ABN, First Publish Date - 2021-06-22T06:53:19+05:30

తమిళనాడులో అభివృద్ధిని పరుగులెత్తించేందుకు ఆర్థిక సలహామండలిని ఏర్పాటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సలహా మండలి ఏర్పాటుకు తమిళనాడు ప్రభుత్వ నిర్ణయం

చెన్నై, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): తమిళనాడులో అభివృద్ధిని పరుగులెత్తించేందుకు ఆర్థిక సలహామండలిని ఏర్పాటు చేయాలని డీఎంకే ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థికంగా కుంటుపడిన రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఇప్పటికే ప్రతిపక్షాలు సహా అన్ని వర్గాల సలహాలు, సూచనలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఆర్థిక సలహా మండలిని ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయించారు.


సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగించిన గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ ఈ మేరకు ప్రకటించారు. ఆర్థికపరమైన అంశాలపై ప్రభుత్వానికి సూచనలు, సలహాలను ఆర్థిక సలహామండలి అందిస్తుంది. ఈ మండలిలో సభ్యులుగా నోబెల్‌ అవార్డు గ్రహీత, అమెరికా ఆర్థిక నిపుణుడు ఎస్తర్‌ డుఫ్లో, రిజర్వుబ్యాంక్‌ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌, కేంద్ర ఆర్థికశాఖ మాజీ సలహాదారు అరవింద్‌ సుబ్రహ్మణ్యం, కేంద్ర ఆర్థికశాఖ మాజీ కార్యదర్శి డాక్టర్‌ ఎస్‌.నారాయణన్‌, ప్రొ.జీన్‌ డ్రీజీ ఉంటారు. 


Updated Date - 2021-06-22T06:53:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising