కొత్త ఏడాది తొలిరోజే రైతుల ఖాతాల్లోకి 20 వేల కోట్లు : ప్రధాని కార్యాలయం
ABN, First Publish Date - 2022-01-01T01:54:29+05:30
న్యూఢిల్లీ : కొత్త సంవత్సరం 2022 తొలి రోజు జనవరి ఒకటిన రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ చేయనుంది.
న్యూఢిల్లీ : కొత్త సంవత్సరం 2022 తొలి రోజు జనవరి ఒకటిన రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ చేయనుంది. పది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి 20 వేల కోట్ల రూపాయలు బదిలీ చేస్తారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం పదో ఇన్స్టాల్మెంట్ కింద ఈ నగదును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే కార్యక్రమంలో బదిలీ చేస్తారని ప్రధాని కార్యాలయం తెలిపింది.
Updated Date - 2022-01-01T01:54:29+05:30 IST