అసెంబ్లీలో ‘పప్పు’ పదం పలకొద్దు!
ABN, First Publish Date - 2021-08-10T08:43:49+05:30
అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఎమ్మెల్యేలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా....
- 1161 పదాలపై మధ్యప్రదేశ్ అసెంబ్లీ నిషేధం
భోపాల్, ఆగస్టు 9 : అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఎమ్మెల్యేలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా మధ్యప్రదేశ్ శాసన సభ కీలక నిర్ణయం తీసుకుంది. పప్పు, చోర్, మిస్టర్ బంటాధార్, వెంటిలేటర్ వంటి పదాలు, వాక్యాలను సభలో పలకకుండా నిషేధం విధించింది. ఏయే పదాలను సభలో వాడకూడదో పేర్కొంటూ జాబితాను అసెంబ్లీ స్పీకర్ జారీ చేశారు. మొత్తంగా 1954 నుంచి ఇలా నిషేధిస్తూ వస్తున్న పదాలు, వాక్యాల సంఖ్య 1161కి చేరింది. ఇందుకు సంబంధించి 38 పేజీల బుక్లెట్ను సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ ఆదివారం విడుదల చేశారు. పప్పు అనే పదాన్ని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీని అవహేళన చేసేందుకు బీజేపీ నేతలు ఉపయోగిస్తుండటం తెలిసిందే. కాగా, వెంటిలేటర్ పదాన్ని నిషేధించడా న్ని కాంగ్రెస్ తప్పుబడుతోంది.
Updated Date - 2021-08-10T08:43:49+05:30 IST