ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందరికీ లబ్ధి చేకూర్చే చట్టం ఎందుకు తేలేదు?: అధీర్ రంజన్

ABN, First Publish Date - 2021-02-11T01:30:02+05:30

రైతు మరణాలకు సంబంధించి తమ (కాంగ్రెస్) ఆందోళనను ప్రధాని మోదీ ప్రస్తావించక..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రైతు మరణాలకు సంబంధించి తమ (కాంగ్రెస్) ఆందోళనను ప్రధాని మోదీ ప్రస్తావించక పోవడం వల్లే తాము లోక్‌సభ నుంచి వాకౌట్ చేసినట్టు లోక్‌సభలో కాంగ్రెస్ విపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ ప్రసంగాన్ని కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు బహిష్కరించాయి. సభ నుంచి వాకౌట్ చేశాయి. అనంతరం మీడియాతో అధీర్ రంజన్ మాట్లాడుతూ, సాగుచుట్టాలను రద్దు చేయాలంటూ ఆందోళన సాగిస్తున్న రైతుల్లో 150 మంది మరణించినా ప్రధాని ఆ ప్రస్తావనే చేయకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేశామన్నారు. రైతు మరణాలపై తమ ఆందోళనను మోదీ పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు.


'రైతు చట్టాలకు సవరణలు అవసరమని ఆయన (ప్రధాని) అంగీకరిస్తున్నారు. ఈ చట్టాల వల్ల కొన్ని రాష్ట్రాలు లబ్ధి పొందుతున్నాయి, కొన్ని రాష్ట్రాలకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదని చెబుతున్నారు. ప్రతి ఒక్కరికీ మేలు చేసే చట్టాలు ఎందుకు తీసుకు రాలేదని మేము ప్రధానిని అడుగుతున్నాం' అని అధీర్ రంజన్ చౌదరి అన్నారు.

Updated Date - 2021-02-11T01:30:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising