కర్ణాటక మంత్రివర్గ విస్తరణ: ఏడుగురు మంత్రుల ప్రమాణస్వీకారం
ABN, First Publish Date - 2021-01-13T22:15:59+05:30
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఎట్టకేలకు బుధవారంనాడు మంత్రివర్గ విస్తరణ ..
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఎట్టకేలకు బుధవారంనాడు మంత్రివర్గ విస్తరణ జరిపారు. కొత్తగా ఏడుగురుని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఎంటీబీ నాగరాజ్, ఉమేష్ కత్తి, అరివింద్ లింబావలి, మురుగేష్ నిరాని, ఆర్.శంకర్, సీపీ యోగేశ్వర్, అంగార ఎస్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్భవన్ గ్లాస్ హౌస్లో మధ్యాహ్నం 4 గంటల సమయంలో కొత్త మంత్రులతో గవర్నర్ వాజుభాయ్ వాలా ప్రమాణస్వీకారం చేయించారు.కర్ణాటక బీజేపీ జనరల్ సెక్రటరీ ఇన్చార్జి అరుణ్ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గత ఏడాది జూలైలో యడియూరప్ప సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చేపట్టిన మూడో మంత్రివర్గ విస్తరణ ఇది.
కీలకమైన మంత్రివర్గ విస్తరణ కోసం గత ఆదివారంనాడు ఢిల్లీ వెళ్లిన యడియూరప్ప ఈ విషయమై కేంద్ర హోం మంత్రి అమిత్షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాతో సమావేశమయ్యారు. పార్టీ అధిష్ఠానం సాధ్యమైనంత త్వరలోనే మంత్రుల పేర్లు ఫైనలైజ్ చేస్తుందని, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి వందశాతం ఇదే చివరి సమావేశం అవుతుందని సమావేశానంతరం మీడియాకు యడియూరప్ప తెలిపారు.
Updated Date - 2021-01-13T22:15:59+05:30 IST