ప్రభుత్వ భూములను కాపాడాలని ధర్నా
ABN, First Publish Date - 2021-08-28T03:51:35+05:30
మున్సి పాలిటీ పరిధిలోని ప్రభుత్వ భూములను కాపాడాలని శుక్రవా రం జేఏసీ నాయకులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వ హించారు. జేఏసీ నాయకులు సూరిబాబు, సంజయ్, జయరాంలు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరి ధిలోని ప్రభుత్వ భూములను కొం దరు కబ్జా చేసి అక్రమంగా నిర్మా ణాలు చేపడుతున్నారని తెలిపారు. వెంటనే వాటిని కూల్చివేయాలన్నా రు.
బెల్లంపల్లి, ఆగస్టు 27: మున్సి పాలిటీ పరిధిలోని ప్రభుత్వ భూములను కాపాడాలని శుక్రవా రం జేఏసీ నాయకులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వ హించారు. జేఏసీ నాయకులు సూరిబాబు, సంజయ్, జయరాంలు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరి ధిలోని ప్రభుత్వ భూములను కొం దరు కబ్జా చేసి అక్రమంగా నిర్మా ణాలు చేపడుతున్నారని తెలిపారు. వెంటనే వాటిని కూల్చివేయాలన్నా రు. ప్రభుత్వ భూముల్లో బోర్డుల ను ఏర్పాటు చేయాలని కోరారు. అక్రమ కట్టడాలను తొలగించాలని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. అలాగే మున్సిపాలి టీలో తాగునీటి సరఫరా చేయడంతో అధికారులు విఫలమ య్యారని, పక్కనే గోదావరి ఉన్నా గుక్కెడు మంచినీరు ఇవ్వలేని స్థితిలో అధికారులు ఉన్నారని పేర్కొన్నారు. అడ ప్రాజెక్టు నుంచి వచ్చే నీరు కలుషితమవుతుందని, గోదావరి నీటిని సరఫరా చేయాలని మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందించారు. నాయకులు శంకర్, అమా నుల్లాఖాన్, రాముసింగ్, గౌస్, రాము, సత్యనారాయణ, శ్రీనివాస్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-08-28T03:51:35+05:30 IST