బీసీబంధు ప్రవేశపెట్టి రూ.10 లక్షలు ఇవ్వాలి: ఆర్ కృష్ణయ్య
ABN, First Publish Date - 2021-08-20T23:49:09+05:30
బీసీబంధు ప్రవేశపెట్టి రూ.10 లక్షలు ఇవ్వాలి: ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్: బీసీబంధు ప్రవేశపెట్టి ప్రతి బీసీ కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. దళిత ప్రభుత్వ ఉద్యోగులకు దళితబంధు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని ఆర్ కృష్ణయ్య అన్నారు. దళితుల కంటే చాలా బీసీ కులాలు వెనుకబడి ఉన్నాయని ఆర్ కృష్ణయ్య గుర్తు చేశారు. ఈ నెల 24న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు దీక్షలు చేపడతామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. బీసీబంధు ప్రకటించేంతవరకు ప్రభుత్వాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు.
Updated Date - 2021-08-20T23:49:09+05:30 IST