కనువిందు చేస్తున్న భీముని పాదం జలపాతం

ABN, First Publish Date - 2021-06-04T20:42:42+05:30

మహబూబాబాద్‌లోని భీముని పాదం జలపాతం కనువిందు చేస్తోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండలు, గుట్టల నుంచి వరద నీటి ప్రవాహం

కనువిందు చేస్తున్న భీముని పాదం జలపాతం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరు: మహబూబాబాద్‌లోని భీముని పాదం జలపాతం కనువిందు చేస్తోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండలు, గుట్టల నుంచి వరద నీటి ప్రవాహం ఉధృతిగా ప్రవహిస్తోంది. దీంతో జలపాతం జలకళ సంతరించుకున్నది. అంతెత్తు నుంచి పడుతున్న జాలువారుతున్న నీటి ప్రవాహాన్ని చూడటానికి రెండు కళ్లు చాలడం లేదని స్థానికులు అంటున్నారు.  


గూడూరు మండలంలోని కొమ్ములవంచ అటవీ ప్రాంతంలో ఈ భీమునిపాదం జలపాతం ఉంది. కోవిడ్‌ నిబంధనల కారణంగా భీముని జలపాతం వద్దకు పర్యాటకులకు అనుమతించడం లేదు. నిబంధనలు సడలించే వరకు జలపాత సందర్శనకు పర్యాటకులు రావద్దని అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-06-04T20:42:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising