కెనరా బ్యాంకుకు టోకరా
ABN, First Publish Date - 2021-08-21T05:08:35+05:30
కెనరా బ్యాంకుకు టోకరా
నకిలీ డాక్యుమెంట్లతో 3.87 కోట్ల రుణాలు
హనుమకొండ రూరల్, ఆగస్టు 20: హనుమకొండ నక్కలగుట్టలోని కెనరా బ్యాంకు(సిండికేట్ బ్యాంకు)లో కొందరు నకిలీ డాక్యుమెంట్లతో సుమారు రూ.3.87కోట్ల మేర రుణాలు తీసుకున్నారు. నిందితులపై బ్యాంకు చీఫ్మేనేజర్ బి.ఇ.ఫణికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సుబేదారి సీఐ రాఘవేందర్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 20మంది వ్యాపార, ఇంటి నిర్మాణాలతోపాటు వివిధ యూనిట్లు నెలకొల్పుతున్నామని నక్కలగుట్ట బ్రాంచ్లో రుణాలు పొందారు. ఒకే కుటుంబానికి చెందిన 14 మంది ఉండటంతో అనుమానం వచ్చిన బ్యాంకు విజిలెన్స్ అధికారులు.. విచారణ చేపట్టగా నకిలీ డాక్యుమెంట్ల బాగోతం బయటపడింది. తప్పుడు పత్రాలతో రుణాలు పొంది, ప్రభుత్వ రాయితీ సొమ్మును కూడా వాడుకున్నట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, 420, 406, 464ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
రుణాలు పొందిన వారు..
సంగి యాదగిరి, వంశీ, వాంకుడోతు శ్రీనివాస్, ఖాజా ముజాహిల్ అబిదీన్, జన్ను శారద, సరిగొమ్ముల స్వరూపారాణి, కె.రేణుక, సోమరాతి ప్రభాత్, సంగి అనిల్, చందా సులోచన, జెట్టి శ్వేత, గాదె అజిత్కుమార్, కాసర్ల సంధ్యారాణి, జన్ను సార, బొడ్డు మౌనిక, సందీప్, బి.వినోద్, మహ్మద్ జాఫర్ఖాన్, మహ్మద్ ఇలియాస్, మహ్మద్ జానీమియా.
Updated Date - 2021-08-21T05:08:35+05:30 IST