‘ఉద్దేశపూర్వకంగానే సమస్యలు సృష్టిస్తున్న కేంద్రం’
ABN, First Publish Date - 2021-12-07T08:16:35+05:30
బియ్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సమస్యలు సృష్టిస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్ శ్రీనివా్సరెడ్డి
హైదరాబాద్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): బియ్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సమస్యలు సృష్టిస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్ శ్రీనివా్సరెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం ప్రకారం ఇస్తామని చెప్పిన బియ్యాన్ని ఇవ్వలేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటులో చేసిన ప్రకటనను ఆయన ఖండించారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. బియ్యం ఇవ్వటానికి తెలంగాణ సిద్ధంగా ఉన్నా స్టోరేజ్ స్పేస్, వ్యాగన్, ర్యాక్ మూవ్మెంట్ కల్పించటంలో ఎఫ్సీఐ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైస్మిల్లుల్లో ఫిజికల్ వెరిఫికేషన్తో నెలల తరబడి మిల్లింగ్ నిలిపివేసి ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
Updated Date - 2021-12-07T08:16:35+05:30 IST