ఓర్వలేకనే రిజర్వేషన్లు తొలగించే కుట్ర
ABN, First Publish Date - 2021-03-22T07:48:50+05:30
స్వాతంత్య్రం సాధించి 70 ఏళ్లయినా భారతదేశంలో రిజర్వేషన్ల ద్వారా అభివృద్ధి పొందింది ఒక శాతం మాత్రమేనని అఖిల భారత ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.మురళీధర్రావు అన్నారు.
ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ అధ్యక్షుడు
నిర్మల్ టౌన్, మార్చి 21: స్వాతంత్య్రం సాధించి 70 ఏళ్లయినా భారతదేశంలో రిజర్వేషన్ల ద్వారా అభివృద్ధి పొందింది ఒక శాతం మాత్రమేనని అఖిల భారత ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.మురళీధర్రావు అన్నారు. ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రభుత్వం రిజర్వేషన్లను తొలగించే కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఆదివారం నిర్మల్లో ‘రిజర్వేషన్లు, ప్రైవేటీకరణ’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని బడుగు, బలహీన వర్గాల సంక్షేమాన్ని విస్మరిస్తూ కార్పొరేట్ సంస్థలకు మేలు కలిగేలా పరిపాలన సాగిస్తోందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలందరూ ఏకమై ప్రైవేటీకరణ, రిజర్వేషన్ల అమలుకు ఉద్యమాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు.
Updated Date - 2021-03-22T07:48:50+05:30 IST