HYD: పేకాటరాయుళ్ల అరెస్ట్...పట్టుబడ్డ వారిలో టీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ల భర్తలు
ABN, First Publish Date - 2021-12-19T16:12:01+05:30
రాచకొండ కీసరలో ఏడుగురు పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: రాచకొండ కీసరలో ఏడుగురు పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. యడగార్పల్లిలో రిసార్ట్ రూమ్లో పేకాట అడుతుండగా వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.65,610 నగదు, 5 మొబైల్స్, ప్లే కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. కాగా అరెస్ట్ అయిన వారిలో టీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ల భర్తలు ఉన్నారు. అధికార పార్టీ నేతలు కావడంతో వారిని వదిలిపెట్టాలంటూ పోలీసులకు నేతల నుంచి కాల్స్ వస్తున్నాయి. జవహర్ నగర్ కార్పొరేషన్ 3వ డివిజన్ భర్త బల్లి శ్రీనివాస్ , 4వ డివిజన్ కార్పొరేటర్ భర్త మరగొని వెంకటేష్, 9వ డివిజన్ కార్పొరేటర్ భర్త మనోహర్రెడ్డి అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. పేకాటరాయుళ్లపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
Updated Date - 2021-12-19T16:12:01+05:30 IST