ఇకనైనా బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి: టీ.మంత్రులు
ABN, First Publish Date - 2021-05-02T18:02:35+05:30
నాగార్జుసాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం దిశగా దూసుకెళ్తున్న నేపథ్యంలో తెలంగాణ భవన్లో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
హైదరాబాద్: నాగార్జుసాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం దిశగా దూసుకెళ్తున్న నేపథ్యంలో తెలంగాణ భవన్లో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సంబరాల్లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ విపక్షాలు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ముందుకు వెళ్ళాలని హితవుపలికారు. తమ ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరుకు నిదర్శనం నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితమని అన్నారు. విపక్షాలు చెప్పిన మాటలు ప్రజలు నమ్మలేదని.. అభివృద్ధికే పట్టం కట్టారని అన్నారు. రేపు మున్సిపల్లోను ఇలాంటి ఫలితాలే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. జానా రెడ్డి గెలిస్తే భవిష్యత్లో ముఖ్యమంత్రి అవుతాడని కాంగ్రెస్ ప్రచారం చేసినా ప్రజలు ఇంటికే పంపించారన్నారు. ‘‘ఇకనైనా బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి..మీకు డిపాజిట్ కూడా రాదు’’ అని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
Updated Date - 2021-05-02T18:02:35+05:30 IST