ఆ విషయంలో కేసీఆర్ తీరు విస్మయం కలిగించింది: జస్టిస్ చంద్రు
ABN, First Publish Date - 2021-12-19T19:53:56+05:30
సీఎం కేసీఆర్పై జస్టిస్ చంద్రు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజావ్యతిరేకంగా..
హైదరాబాద్: సీఎం కేసీఆర్పై జస్టిస్ చంద్రు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజావ్యతిరేకంగా మాట్లాడితే ఎవరూ ఎక్కువ రోజులు అధికారంలో ఉండలేరని కేసీఆర్ని హెచ్చరించారు. ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ తీరు విస్మయం కలిగించిందన్నారు. సమ్మె ఎన్నిరోజులు చేస్తారో చూస్తానని కేసీఆర్ బెదిరించారని చెప్పారు. యూనియన్లతో కాకుండా ఉద్యోగులతోనే మాట్లాడతాననడం ఏంటి? అని ప్రశ్నించారు.కచ్చితంగా యూనియన్లతోనే మాట్లాడాలన్నారు. జలహక్కులకు వ్యతిరేకంగా వెళ్తే కేసీఆర్ ఎన్నో రోజులు అధికారంలో ఉండలేరని చెప్పారు. జై భీమ్ సినిమా ఒక కొత్త గుర్తింపు కార్డు తీసుకొచ్చిందని, ఈ సినిమా తర్వాత దేశవ్యాప్తంగా ఆహ్వానాలు వస్తున్నాయని జస్టిస్ చంద్రు తెలిపారు.
Updated Date - 2021-12-19T19:53:56+05:30 IST