ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వచ్ఛందంగా రక్తదానం చేయాలి

ABN, First Publish Date - 2021-11-02T05:40:10+05:30

స్వచ్ఛందంగా రక్తదానం చేయాలనే తపన యువతలో కలిగి ఉండాలని ఎస్పీ సింధు శర్మ అన్నారు.

రక్తదానం చేస్తున్న జిల్లా ఎస్పీ సింధు శర్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్పీ సింధు శర్మ

జగిత్యాల టౌన్‌, నవంబరు 1 : స్వచ్ఛందంగా రక్తదానం చేయాలనే తపన యువతలో కలిగి ఉండాలని ఎస్పీ సింధు శర్మ అన్నారు. జగిత్యా ల జిల్లా పోలీస్‌ శాఖ, జిల్లా రెడ్‌ క్రాస్‌ సోసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని స్థానిక విరూపాక్షి గార్డేన్‌లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ సంధు శర్మతో పాటు పోలీస్‌ అధికారులు, యువకులు 59 మంది రక్తదానం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ రక్తదానం అనేది అన్ని దానాల్లోకెల్లా మహాదానమని పేర్కొన్నారు. ఆపద సమయంలో, రోడ్డు ప్రమాదాల్లో ఎందరికో రక్తం అవసరముటుందని, అలాంటి వారికి రక్తం దానం చేయడం వారి ప్రాణా లను నిలబెట్టిన వారమవుతామని పేర్కొన్నారు. ప్రస్తుత తరుణంలో యువత తమ చదువులు, ఉన్నత లక్ష్యాలను అధిగమించి సమాజానికి మంచి చేయాలనే తపనతో ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్‌ ఎస్పీ సురేష్‌కుమార్‌, డీఎస్పీ ప్రకాష్‌, రెడ్‌ క్రాస్‌ సోసైటీ సభ్యుడు మంచాల కృష్ణ ఉన్నారు.

Updated Date - 2021-11-02T05:40:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising